నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు రూరల్ 11 కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలోని పలు గ్రామాలకు నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా గోపాలరావుపేట, మునిగేపల్లి, జీళ్ళచెరువు గ్రామాల్లోని గృహ, వ్యవసాయ కనెక్షన్లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వెల్లడించారు.