చక్రేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తమిళనాడు ఐజీ

చక్రేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తమిళనాడు ఐజీ

NZB: బోధన్ పట్టణంలోని చారిత్రక శ్రీ ఏకచక్రేశ్వరాలయాన్ని సోమవారం తమిళనాడుకు చెందిన ఐజీ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఆయన సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మను అడిగి ఆలయ విశిష్టత, చరిత్ర గురించి ఐజీ తెలుసుకున్నారు.