ములుమూడి బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
నెల్లూరు రూరల్ ములుమూడి గ్రామంలో రూ.42.50 లక్షలతో ములుమూడి కలుజు మీద బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.