ఉద్యోగుల బకాయిలు విడుదల
TG: ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R&B శాఖలో పెండింగ్ బిల్లులు విడుదలయ్యాయి. అక్టోబర్ నెలకు సంబంధించి రూ.1,031 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు కాగా.. పంచాయతీరాజ్, R&B శాఖలో 46,956 బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.