జిల్లాలో ఉపాధి హామీ పనుల తనిఖీ
NLR: సైదాపురం మేజర్ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులును ఆ శాఖా ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అన్నపూర్ణ బుధవారం తనిఖీ చేశారు. ఆమె హాజరు, డీ మస్టర్ పరిశీలించారు. ఎంత వేతనాలు వస్తున్నాయి అని ఉపాధి హామీ శ్రామికులని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు నరేశ్, చంద్రశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.