అట్టహాసంగా ‘సృజన’ ప్రారంభం
VSP: ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ‘సృజన’ మూడురోజుల వర్క్షాప్, ఎగ్జిబిషన్ కార్యక్రమం విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అతిథులు విద్యార్థుల ఆవిష్కరణలను ప్రారంభించి, ఇలాంటి వేదికలు సృజనాత్మకతకు దోహదమని పేర్కొన్నారు.