ఆర్డీటీ కోసం లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం: తలారి రంగయ్య
ATP: ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం వెంటనే FCRA పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 'లక్ష పోస్ట్కార్డుల ఉద్యమం' చేపడుతున్నట్లు మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గంలో ఉద్యమ కార్డులను ఆయన ఆవిష్కరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న ఆర్డీటీకి నిధుల అడ్డంకులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.