అంబులెన్స్లోనే ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
ADB: భీంపూర్ మండలం వాడూర్ గ్రామానికి చెందిన కమల అనే గర్భిణీ మహిళకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ (EMT) దత్తు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పైలట్ ప్రవీణ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.