పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్
E.G: జగ్గంపేట మండలం జై కొత్తూరు గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై రఘునందన రావు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 5,200 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాట, గుండాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.