5K రన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
KRNL: సెన్సెస్-2027పై అవగాహన కల్పిస్తూ ఆదివారం కర్నూలులో 5కే రన్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రన్ సాగింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి, జనగణనకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.