కానుమోలీలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ
కృష్ణా: బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను నేరుగా పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు. అర్జీలు స్వీకరించి కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి, మిగతావాటిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సేవలు పారదర్శకంగా అందాలని సూచించారు.