VIDEO: అల్లకల్లోలంగా మారిన సముద్రం
Vsp: మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో బుధవారం ఉదయం విశాఖ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీని కారణంగా, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద అలలు ఉధృతంగా ఉన్నాయి. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో, అధికారులు జారీ చేసిన హెచ్చరికల మేరకు మత్స్యకారులు తమ పడవలను హార్బర్లోనే సురక్షితంగా లంగరు వేసి ఉంచారు.