శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కళ్యాణం
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణాన్ని అర్చకులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం జరిపించారు. అనంతరం, వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి, ఆగమశాస్త్రం ప్రకారం కళ్యాణోత్సవం జరిపించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.