T20 WC ఫైనల్.. అభిమానులకు శుభవార్త
రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య T20 WC టైటిల్ పోరు జరగనున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు విమానయాన సంస్థలు శుభవార్త చెప్పాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్కు అదనపు ఫ్లైట్ సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియ ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ ప్రకటించాయి. అటు భారతీయ రైల్వే కూడా పలు ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.