ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన సదస్సు
MLG: మంగపేట (M)మొట్లాగూడెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పై AEO మహేష్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. AEO మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందులకు బదులుగా జీవామృతం, పంచామృతం, అగ్నీ అస్త్రం, నీమాస్త్రం వంటి సహజ ఎరువులను స్వయంగా తయారు చేసుకుని వాడాలని సూచించారు. ఈ పద్ధతులతో భూసారం పెరగడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయన్నారు.