శ్యామలానగర్ రైల్వే గేటుకు ROB ఆమోదం
గుంటూరు శ్యామలానగర్ రైల్వే గేటు (నం.312) వద్ద ట్రాఫిక్ సమస్యలు త్వరలో తగ్గనున్నాయి. రైళ్ల రాకపోకలు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో డబుల్ లైన్ ROBకి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుకు రూ.78.46 కోట్లు కేటాయించగా, డీపీఆర్ కోసం రూ.9.52 కోట్లు విడుదల చేశారు. భూసేకరణ పూర్తయ్యాక నిర్మాణం ప్రారంభం కానుంది.