ట్రావెల్స్ బస్సుల్లో పోలీసుల తనిఖీలు
ప్రకాశం: మార్కాపురం మండలంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కంభం పట్టణంలో సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పరిశీలించారు. బస్సుల పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ మరియు భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.