తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన సీఐ
VZM: ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి ఆకస్మిక వాహన తనిఖీలు సోమవారం చేపట్టారు. ఈ తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకొని వాహనాలను స్టేషనుకు తరలించారు. తల్లిదండ్రులను స్టేషనుకు పిలిపించి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని సూచించారు.