'క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి'
SKLM: కంచిలి మండలం అర్జునాపురం ఎంపీపీ పాఠశాలలో బుధవారం వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఎంఎటీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్రెడ్డి పాల్గొని, విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విద్యతోపాటు క్రమశిక్షణ, విలువల పెంపు అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.