బీఆర్ఎస్లో చేరిన బీఎస్పీ నాయకులు

KMR: భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన బీఎస్పీ నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 30 మంది పార్టీలో చేరినట్లు యువ నాయకులు రంజిత్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ విష్ణు పాల్గొన్నారు.