VIRAL: కోహ్లీని చుట్టుముట్టిన చిన్నారులు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రేపు రాయ్పూర్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు రాయ్పూర్కు చేరుకున్నాయి. విరాట్ కోహ్లీని చూసేందుకు చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. అతడు హోటల్ లోపలికి వెళ్లేటప్పుడు చిన్నారులు అతడిని చుట్టుముట్టారు. గులాబీలతో స్వాగతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.