'విద్యార్ధుల భవిష్యత్తుకు భరోసానిద్దాం'
VZM: విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విద్యార్ధులకు నైతిక విలువలను బోధించడంతోపాటు ఫోక్సో తదితర చట్టాలపైన, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పలితాలపైనా బాలురకు అవగాహన కల్పించాలని సమీక్షా సమావేశంలో సూచించారు.