బంగారు పథకం అందుకున్న చౌడేకర్ యోగేష్
KMR: మద్నూర్ మండల కేంద్రానికి చెందిన చౌడేకర్ యోగేష్ కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్నారు. చౌడేకర్ సంతోష్ యమున దంపతుల కుమారుడైన యోగేష్ 2020-21 సంవత్సరానికి గాను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.