కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు ప్రధాని

కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో 'ఆపరేషన్ సింధూర్' గురించి చర్చించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు పాక్, POKలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలతో పాటు.. భద్రత పరంగా తీసుకున్న చర్యలను కూడా రాష్ట్రపతికి వివరించనున్నారు.