‘బలవంతపు భూ సేకరణ ఆపాలి’
SKLM: సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్కు సంబంధించిన బలవంతపు భూ సేకరణ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డీ.గోవిందరావు అన్నారు. ఇవాళ బాధిత గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోర్ట్ నిర్మాణంకు భూములు సేకరించటం వలన పంటలు పండించే రైతులు భూములు కోల్పోయి నష్టపోతారని పేర్కొన్నారు. బలవంతపు భూ సేకరణ చేస్తే పోరాటం చేస్తామన్నారు.