అకాల వర్షం.. నీట మునిగిన వరి పంట

అకాల వర్షం.. నీట మునిగిన వరి పంట

TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా వరి పంట నీట మునిగింది. దీంతో రైతులు నష్టపోయారని సీపీఐ నాయకుడు జనమాల గురవయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని ఇవాళ ఆయన డిమాండ్ చేశారు. ఏర్పేడు మండలం కోబాక గ్రామంలో పంటలను పరిశీలించి అధికారులను చర్యలు తీసుకోవాలని కోరారు.