ఇంటర్ పరీక్షకు 96.14 శాతం హాజరు
KMR: జిల్లావ్యాప్తంగా నేడు జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 10,581 మంది విద్యార్థులకు గాను 10,173 మంది హాజరయ్యారు. 408 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, జిల్లాలో సగటు హాజరు శాతం 96.14గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించినట్లు వారు తెలిపారు.