రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KDP: మైదుకూరు మండలం పరిధిలో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు పవర్ సప్లై నిలిపివేస్తున్నట్లు మైదుకూరు ఏఈ రామ భద్రయ్య తెలిపారు. నంద్యాలం పేట సబ్స్టేషన్లో ఉన్న 11 కేవీ గాంధీనగర్ ఫీడర్లో మరమ్మతులు చేస్తున్న కారణంగా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్కు అంతరాయం ఉంటుందని, ప్రజలందరూ గమనించి సహకరించాలని విద్యుత్ ఏఈ కోరారు.