హోర్ముజ్ మూసివేత.. నిలిచిన 37 నౌకలు
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా ఉన్న హోర్ముజ్ జలసంధిని మూసివేశారు. దీంతో వందలాది నౌకలు సముద్ర మార్గంలోనే ఉండిపోయాయి. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్రాల్లో 37 భారత జెండాలున్న నౌకలు నిలిచిపోగా.. అందులో 1000 మందికిపైగా నావికులు ఉన్నట్లు సమాచారం.