VIDEO: 'నాణ్యతలేని ఆహార విక్రయం చేస్తే జరిమానా తప్పదు'
VSP: విశాఖ ఎంవిపీ కాలనీ ఏఎస్ రాజా సర్కిల్ రోడ్డుపై ఉన్న ‘చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు’ బండిపై అధికారులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన పన్నీర్, మష్రూమ్ కర్రీలను విక్రయిస్తున్నట్టు గుర్తించిన శానిటరీ ఇన్స్పెక్టర్ రవి, షీ టీం రూ. 2,500 జరిమానా విధించారు. ఇలాంటి షాపులపై దాడులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.