'విద్యుత్ సమస్యలను పరిష్కరించండి'

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధాన విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి ఎమ్మెల్యే ధర్మరాజు తీసుకువెళ్లారు. ఆదివారం ఏలూరులో మంత్రిని ధర్మరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలంలో విద్యుత్ సమస్యలు, లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని కోరారు.