కాశీబుగ్గ తొక్కిసలాట.. ఆర్థిక సాయం ప్రకటించిన లోకేష్
AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధితులకు మంత్రి లోకేష్ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామని పేర్కొన్నారు. కాశీబుగ్గలోని ఘటనా స్థలితో పాటు, పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.