ఉత్తమ సేవా పతకం అందుకున్న ASI

GNTR: పోలీస్ శాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉత్తమ సేవా పతకాలను శుక్రవారం గుంటూరు పోలీసు కవాతు మైదానంలో మంత్రి నారా లోకేశ్ అందజేశారు. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై జాన్ ఖాన్ మంత్రి లోకేశ్ చేతుల మీదుగా పోలీస్ ఉత్తమ సేవా పతకం అందుకున్నారు.