మూడో టీ20: టీమిండియాలో మార్పులు..?
భారత్, సౌతాఫ్రికా మధ్య మరికాసేపట్లో మూడో టీ20 మొదలుకానుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ను తప్పించి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించనున్నట్లు సమాచారం. అలాగే, ఓపెనర్ శుభ్మన్ గిల్ ప్లేస్లో సంజూ శాంసన్ను ఆడించే అవకాశం కనిపిస్తోంది.