సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

GDL: ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిశీలించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ BM సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ద్వారా కలెక్టర్ నేరుగా అర్జీలను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.