రాష్ట్రంలో అధికారమే కల్తీగా మారింది: మాజీమంత్రి
KKD: రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, అధికారమే కల్తీగా మారిందని వైసీపీ మాజీమంత్రి కాకినాడ రూరల్ ఇంఛార్జ్ కురసాల కన్న బాబు ఆరోపించారు. శుక్రవారం రూరల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కల్తీ పాలు తాగి జనం చచ్చిపోతే శవాల వద్ద కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే అధికార ఎమ్మెల్యేలు ఆటలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.