దండి మార్చ్ బృందానికి సీఐ స్వాగతం

దండి మార్చ్ బృందానికి సీఐ స్వాగతం

బాపట్ల: మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ టీం నిర్వహిస్తున్న ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ యాత్ర బాపట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐ రాంబాబు బృందాన్ని అభినందించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రజలకు డ్రగ్స్ ప్రమాదాలపై వివరించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.