మాజీ 'మిస్ ఇండియా ఎర్త్' మిస్సింగ్
పుణె పింప్రి-చించ్వాడ్లో మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సుర్వే అదృశ్యమయ్యారు. ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె.. ఇటీవలే తిరిగి హిందూమతంలోకి మారారు. ఈ సందర్భంగా తన భర్త లవ్ జిహాద్, వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేశారు. మరోవైపు తన కుమార్తెను అత్తింటివారే కిడ్నాప్ చేసినట్లు సయాలీ తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.