'సెల్ టవర్ నిర్మాణం ఆపండి'
PLD: అమరావతి మండలం మల్లాదిలో జనావాసాల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని స్థానిక మహిళలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు నిన్న వినతి పత్రం అందజేశారు. ఆ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల, ఇళ్లు, ప్రార్థనా మందిరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. టవర్తో ఆరోగ్య సమస్యలు వస్తాయని, తమ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.