ప్రత్యేక పుష్పాలంకరణలో వేంకటేశ్వర స్వామి

కోనసీమ: అమలాపురం పట్టణంలోని పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయంలో శనివారం శ్రీస్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.