VIDEO: ఛైర్పర్సన్లు మారినా.. తీరని మురికి కష్టాలు
సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డు శ్రీనగర్ కాలనీలో పారిశుద్ధ్యం పడకేసింది. మురికి కాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమలు పెరిగి, కాలనీవాసులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఛైర్పర్సన్లు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేయించాలని వారు కోరారు.