జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

MBNR: జిల్లాలో రాజాపూర్, మహబూబ్ నగర్, నవాబుపేట, గండీడ్, మహమ్మదాబాద్ మండలాలకు సంబంధించి 139 పంచాయతీల్లో మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.