మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
KMR: భిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నరసింహులు (35) మద్యం మత్తులో బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాంటి పని చేయకుండా మద్యం తాగుతూ తిరిగే నరసింహులు, ఇంట్లో డబ్బులు అడగ్గా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.