వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

WGL: ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం తేజా మిర్చి క్వింటాకు రూ.16,000లు పలకగా.. ఈరోజు సైతం అదే ధర పలికింది. అలాగే 341 రకం మిర్చి మంగళవారం క్వింటాకి రూ.14,500 ధర రాగా బుధవారం కూడా రూ.14,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH)మిర్చికి మంగళవారం రూ.13,500, బుధవారం రూ.14,000 ధర పలికింది.