'పాత పద్ధతిలోనే ఇసుక రవాణాకు అనుమతించాలి'

'పాత పద్ధతిలోనే ఇసుక రవాణాకు అనుమతించాలి'

SRCL: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్‌లైన్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే ఇసుక రవాణా అనుమతించాలని వీర్నపల్లి మండలం పదిర, హరిదాస్ నగర్ గ్రామాల ట్రాక్టర్ యజమానులు తహసీల్దారు సుజాతకు వినతి ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆన్‌లైన్ విధానంతో రెండు గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యజమానులు, 100 మంది డ్రైవర్లు, 400 మంది కూలీలు ఉపాధి కోల్పోతారని చెప్పారు.