నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: రాజాం, పాలకొండ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని AE కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాలకొండ రోడ్డులో బాబానగర్, ఈశ్వర్ నారాయణ కాలనీ, రోడ్డుకు ఇరువైపులా ఉన్న వీధుల్లో విద్యుత్ సరఫరా నిలిపోతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.