మార్చి 3న కనకమహాలక్ష్మి ఆలయం మూసివేత
VSP: మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం పురస్కరించుకుని విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. గ్రహణం కారణంగా మధ్యాహ్నం పంచామృతాభిషేకం ముగిసిన తర్వాత దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి రాత్రి గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి దర్శనాలకు అనుమతిస్తారు.