బలూచ్ ప్రజలపై పాక్ సర్కార్ దౌర్జన్యం
పాకిస్తాన్లోని షరీఫ్ ప్రభుత్వం బలూచ్ ప్రజల అణచివేతకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బలూచ్ ప్రజల జీవనాధారమైన ఇంధనాన్ని కాల్చివేసింది. ఈ ఘటనను బలూచ్ యక్జెహ్తీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. పాక్ ప్రభుత్వ చర్యను ఖండించింది. కేవలం ప్రకటనలు కాకుండా, మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ను బాధ్యత వహించేలా ప్రాయోగిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.