'ఇకపై ప్రతి సోమ , శుక్రవారాలలో PGRS కార్యక్రమం'
PPM: జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సీతంపేట ITDA లో ప్రతి సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని ఇకపై ప్రతి శుక్రవారం కూడా నిర్వహించనున్నట్లు ITDA PO పవార్ స్వప్నీల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతి శుక్రవారం ఉ.10:30 నుంచి సా. 2 వరకు ITDA లోని ఎస్.ఆర్.శంకరన్ మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.