విద్యాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం MLA
SKLM: విద్యాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మండలం రామచంద్రపురం గ్రామంలో రూ.12 లక్షలతో మరమ్మతులు చేపట్టిన ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ, మరుగుదొడ్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీడీవో రామ్మోహన్ రావు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.